Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎర్రంనాయుడు ఆరోపణ

Yerram Naidu
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ స్థానం అభ్యర్థి వైయస్ జగన్ కర్ణాటక మంత్రి, బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రన్నాయుడు విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే మాటలను ఎవరూ విశ్వసించబోరని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్‌కు గానీ కాంగ్రెసు పార్టీకి గానీ ఓటేస్తే దాన్ని బురదలో వేసినట్లేనని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడప లోకసభ స్థానంలో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు.

కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌ను ఓడించడం ఖాయమని కడప తెలుగుదేశం అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఉదయం వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. వామపక్షాలతోనే తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నట్లు ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. సరైన సమయంలో మిత్రపక్షాలు ప్రచారంలోకి వస్తాయని ఆయన చెప్పారు. వామపక్షాలు తన తరఫున ప్రచారం చేస్తాయని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+