అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి బాబా వీలునామా రాయలేదు, దాని ప్రసక్తి రాదు: శ్రీనివాసన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని గురువారం ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ప్రతినిధుల సమావేశంలో మద్రాసు శ్రీనివాసన్ చెప్పారు. బాబా ఎలాంటి వీలునామా కూడా రాయలేదని చెప్పారు. అన్ని ఆస్తులు ట్రస్టు పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇక వీలునామా ప్రస్తావన ఎందుకు వస్తుందని చెప్పారు. బాబాకు ఆస్తులు కాకుండా భక్తులు మాత్రమే ఉన్నారని చెప్పారు. బాబా ఆస్తిపాస్తులు వంటి భవబంధాలు లేని వ్యక్తి అని చెప్పారు. ఆదికేశవులునాయుడు కేవలం బాబాకు భక్తుడు మాత్రమే అని అన్నారు. ఆయనకు ట్రస్టుతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ట్రస్టులో తమిళుల ఆధిపత్యం లేదన్నారు. బాబా నియమించిన వారే ట్రస్టులో ఉన్నారని చెప్పారు.

తాను ట్రస్టు సభ్యుడిని కానని కేవలం ట్రస్టుకు కార్యదర్శిని మాత్రమేనని చక్రవర్తి గురువారం జరిగిన విలేకరుల ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. షిర్డీ తరహాలో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసే విషయంతో పాటు బాబా సమాధిని దర్శించుకునే విజ్ఞప్తులను పరిశీలిస్తామని బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ చెప్పారు. ఇప్పటి వరకు బాబాకే చెక్ పవర్ ఉందని ఇకముందు చెక్ పవర్ ఎవరికి ఉండాలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చెక్ పవర్ ఇద్దరికి ఉండాలని తాను సూచిస్తానని రత్నాకర్ చెప్పారు. హైందవ సాంప్రదాయం ప్రకారం బాబాకు అంత్యక్రియలు పెద్ద కొడుకు చేయవలసి ఉన్నప్పుటికి బాబా ఆజ్ఞ మేరకే తాను చేసినట్టుగా చెప్పారు.

English summary
Sathya Sai Trust member Srinivasan said today that Bhagvan Sri Sathya Sai Baba have no properties on his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X