వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరికలను ఖాతరు చేయని పైలట్లు, నాలుగో రోజుకు సమ్మె

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India
న్యూఢిల్లీ: ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చేసిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఇండియన్ ఎయిర్ లైన్స్ సమ్మె సాగుతోంది. శనివారానికి సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. యాజమాన్యం 9 మంది పైలట్లను సస్పెండ్ చేసింది. పాక్షిక లాకౌట్‌ను ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోగా విధుల్లో చేరాలని ఎయిర్ లైన్స్ 850 మంది పైలట్లను హెచ్చరించింది. అయితే, పైలట్లు దిగి రాలేదు. కాగా, ఎయిర్ బస్ ఎ - 320 విమానాలను నడపడానికి కింగ్ ఫిషర్ పైలట్లను వాడుకోవడానికి ఎయిర్ ఇండియా పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) అనుమతిని పొందింది. అయితే, అటువంటిదేమీ లేదని కింగ్ ఫిషర్ అధికార ప్రతినిధి చెప్పారు.

సిఎండి అరవింద్ జాదవ్‌ను తొలగించాలనే తమ డిమాండ్ నుంచి పైలట్లు వెనక్కి తగ్గడం లేదు. సిఎండి తప్పుకోవాల్సిందేనని, అరెస్టులకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, మొత్తం 31 వేల మంది ఉద్యోగులు కూడా అరెస్టు అవుతారని ఐసిపిఎ ప్రధాన కార్యదర్శి రిషబ్ కపూర్ అన్నారు. హెచ్చరికలకు దిగి రాకపోవడంతో మరో 80 నుంచి 100 మంది పైలట్లపై వేటు పడవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం 320 విమానాలు నడవాల్సి ఉండగా 30 విమానాలు మాత్రమే నడిచాయి.

English summary
The threat of mass pilot sackings and a partial lockout now loom large over the erstwhile Indian Airlines. The airline had asked the 850 striking pilots to resume work by 5pm on Friday — day three of the strike that saw only 39 of the 320 daily flights getting operated and over 16,000 passengers stranded across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X