హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస అధినేత కె. చంద్రశేఖర రావుతో టిడిపి నేత నాగం జనార్దన్ రెడ్డి దోస్తీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janaardhan Reddy-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి స్నేహానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన విషయాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తెలంగాణ కోసం భవిష్యత్తులో తెరాసతో కలిసి పనిచేయాల్సి ఉందని, అందుకే తెరాసపై విమర్శలు చేయడం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే, మహబూబ్‌నగర్‌లో జరిగిన తెరాస దశాబ్ది ఉత్సావాల్లో తెలంగాణ సాధన కోసం కచ్చితమైన, నిర్దిష్టమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ మాటలు ఆయన కెసిఆర్‌కు అనుకూలంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. కెసిఆర్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఆయన తమను దూషించినా తాము మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న కెసిఆర్‌పై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ పార్టీని నిర్మూలించడానికి పూనుకున్న కెసిఆర్‌పై ఎదురుదాడికి దిగాలని ఆయన పదే పదే పార్టీ తెలంగాణ నాయకులకు సూచిస్తున్నారు. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డి ప్రకటన చంద్రబాబుకు పుండు మీద కారం చల్లినట్లు ఉంటుందనడంలో సందేహం లేదు.

నాగం జనార్దన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కో అడుగే ముందుకు వేస్తున్నారనే విషయం కూడా ఆ మాటల ద్వారా వెల్లడవుతోంది. కెసిఆర్ తెలంగాణావాదులపై విరుచుకుపడడం మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం పార్టీ జెండాలను పక్కన పెట్టాలని, తెలంగాణ ఎజెండాతో ముందుకు సాగాలని ఆయన అన్నారు.

English summary
It seems TDP Telangana forum convenor Nagam Janardhan Reddy is prepared to make friendship with TRS president K Chandrasekhar rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X