టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్పై విజయవాడలో పోలీసు కేసు నమోదు!

వాదనలు విన్న కోర్టు కెసిఆర్పై కేసు నమోదు చేయాలని సత్యనారాయణపురం పోలీసులను అదేశించింది. కేసిఆర్పై భయందోళన కల్పించడం, బెదిరింపు గురిచేయడం ఆరోపణలపై 153, 153ఏ, 153బి, 500, 506 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కాగా గత ఏప్రిల్ 16న చండీయాగం చివరి రోజు తెలంగాణ బ్రాహ్మణులు నిష్టగా ఉంటారని, ఆంధ్రా బ్రాహ్మణులు ఆర్బాటాలకు పోతారని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాదులో ఇందిరాపార్కు వద్ద జరిగిన బ్రాహ్మణుల సమాఖ్యలో తెలంగాణ, ఆంధ్ర బ్రాహ్మణుల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పరిచిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications