ఓటర్లను భయపెడుతున్న డిఎల్ను గృహనిర్బంధం చేయాలి: అంబటి

మంత్రి డిఎల్ ఉదయం నుంచి బూత్ ల వద్దకు వెళుతూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. బూత్ ల లోపలకు అభ్యర్థిగా అయనను అనుమతిస్తారని, పిఏని ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని ఓటమి భయంతో డిఎస్ అసత్యప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి రవీంద్రా రెడ్డి భార్య సుభద్రమ్మ ఉదయం పోలింగ్ బూత్ లో ఇవిఎంల వద్ద కొబ్బరి కాయలు కొట్టారని, అలా ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవిఎంల వద్ద టెంకాయలు కొట్టేందుకు అనుమతించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పోలింగ్ సరళి బాగుందన్నారు. ఈ విధంగా సాయంత్రం వరకు జరిగితే పోలింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications