టిడిపిలో డబ్బుల గోల: విపక్షాల ఖర్చు ముందు బేజారు!

'ఆ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం అంతా వెర్రెత్తి పోయిందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి డబ్బులు...డబ్బులని ప్రాణం తోడేస్తున్నారు. ఓటర్లు కూడా డబ్బులు ఇస్తేనే మాట్లాడండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. యావత్ ఎన్నికల యంత్రాంగం కుప్ప కూలింది. డబ్బుల పంపిణీ యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకొనే నాధుడు కరువయ్యాడు' అని టీడీపీ ముఖ్య నేత ఒకరు వాపోయారు. కడపలో డబ్బు పంపిణీలో ప్రత్యర్థులతో పోటీ పడాల్సి రావడం ప్రతిపక్షంలోని టీడీపీకి ఇరకాటంగా మారింది.
వరుసగా రెండోసారి ప్రతిపక్షంలోకి రావడంతో వనరులపరంగా చాలా ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో కడపలో తమ ప్రత్యర్థులకు ఈ విషయంలో దరిదాపులకు నిలవడం కూడా తమకు అసాధ్యంగా మారుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కడపలో ఈ పరిస్థితి వస్తుందని ముందే గుర్తించిన టీడీసీ నేతలు ఒక స్థాయిలో దానికి సిద్ధమయ్యారు. ఓటుకు రెండు వందల చొప్పున పేద వర్గాల వారి వరకూ పంపిణీ చేయాలన్నది వారి వ్యూహం. కాని ప్రత్యర్థి పార్టీలు పంచే మొత్తం భారీగా ఉండటంతో టీడీపీ నేతలు ఈ విషయంలో బాగా వెనకబడిపోయారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications