ఢిల్లీ అహంకారాన్నీ వైయస్ జగన్ దెబ్బ తీశారు: కొండా సురేఖ

Konda Surekha
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యూఢిల్లీ అహంకారాన్ని దెబ్బ తీశారని కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ ఆదివారం వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిర్వహిస్తున్న రైతు దీక్ష కార్యక్రమంలో అన్నారు. సోనియా అహంకారానికి, తెలుగు ఆత్మ గౌరవానికి జరిగిన ఎన్నికలలో ఢిల్లీ అహంకారానికి కడప జిల్లా ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె అన్నారు. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంత్రులు, నేతలు అంతా కడపలో బస చేసి జగన్‌ను ఓడించాలని ప్రయత్నాలు చేశారని అన్నారు.

జగన్ ఓటమి కోసం చేసిన ప్రయత్నానికి బదులు రైతులపై దృష్టి సారిస్తే ఇప్పటికే రైతుల సమస్య తీరిపోయేదని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఆ పదవి ఎందుకు లభించిందో చెప్పాలన్నారు. ఆయన కన్నా అనుభవజ్ఞులు ఎంతో మంది ఉన్నప్పటికీ కిరణ్‌నే సిఎం పీఠంపై ఎందుకు కూర్చుండబెట్టారని ప్రశ్నించారు. జగన్ వెంట నాయకులు ఉన్నా లేకున్నా ప్రజలు, రైతులు ఉన్నారన్నారు. రైతుల కన్నీటిలో కాంగ్రెసు ప్రభుత్వం కొట్టుకు పోవడం ఖాయమన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+