డుండీ యూనివర్సీటిలో ఈగల్ని దోచుకెళ్లిన దొంగలు

అవునా ఎక్కడ జరిగింది..?
బ్రిటన్లోని డుండీ యూనివర్సీటిలో...
ఏం దోచుకెళ్లారేంటి..?
"ఈగలు".
ఈగలా...!! ఈగల్ని దోచుకెళ్లారా..?
అవును ఈగలే కాకపోతే, అత్యంత విశిష్టమైన తేనెటీగలు.
వాటితో ఏంచేస్తారు..? కొంపదీసి కూర వండుకుంటారా లేక తేనె పిండుకుంటారా..?
అవి మామూలు తేనెటీగలు కాదు. కొన్ని కోట్లు ఖర్చుచేసి శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ రీసెర్చ్ ప్రాజెక్ట్లో భాగంగా సేకరించిన ప్రత్యేక జాతికి చెందినవి. న్యూరోసైన్స్ అధ్యయనం కోసం వీటిని సేకరించారు.
ఎన్ని ఈగలు పోయాయ్..?
ఒకటి కాదు రెండు కాదు.. వేలాది సంఖ్యలో ఈగలు పోయాయి. నాలుగు ప్రత్యేక బాక్సుల్లో ఉంచిన ఈగల్ని దుండగులు అపహరించారు.
అస్సలు ఈ ప్రాజెక్ట్ ఏంటి..?
అంతరించిపోతున్న తేనెటీగల జాతుల గురించి చేస్తున్న అధ్యయనం. ఈ ప్రాజెక్టుకు డాక్టర్ క్రిస్ కన్నోలీ నాయకత్వం వహిస్తున్నారు.
మరి పరిశోధకులు ఏంచేశారో..?
ఏముంది ఈగలు పోయాయని స్కాట్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తర్వాత..?
తర్వాతేముంది ఆ ఈగల ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయండని స్కాట్లాండ్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. వాటి గురించి మీకేమన్నా తెలిస్తే వెంటనే స్కాట్లాండ్ పోలీసులకు సమాచారం అందించండి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications