కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస అధినేత కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి తీవ్రమైన ఎండ దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేపట్టిన మూడో విడత ఆందోళన కార్యక్రమాలపై ఎండ దెబ్బ పడింది. కేంద్రాన్ని కదిలించాలని ఉద్దేశించిన ఈ ఆందోళనా కార్యక్రమాలకు వేడి గాలులు అడ్డుపడుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో గురువారం తెరాస మండల కేంద్రాల్లో తలపెట్టిన ధర్నాలకు అంతగా స్పందన రాలేదు.

తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎండ దంచికొడుతోంది. దీంతో కొద్ది మంది మాత్రమే ధర్నాలకు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, విద్యార్థులు ఎండలకు భయపడి రావడం లేదని తెరాస నాయకులు చెబుతున్నారు. పార్టీ నాయకులు పదే పదే గుర్తు చేసినా, సంప్రదించినా హాజరు శాతం తక్కువే ఉంటోంది.

నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కెసిఆర్ సొంత జిల్లా మెదక్‌లో ఆందోళనల ఊసే లేదు. రంగారెడ్డి జిల్లాలో కూడా అదే స్థితి. ఎండ దెబ్బకు భయపడే ఎవరూ రావడం లేదని, ఎండ దెబ్బకు భయపడే కెసిఆర్ కరీంనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. మే 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, 30వ తేదీన రైల్ రోకో కార్యక్రమాలు జరగాల్సి ఉంది.

English summary
he heat wave in Telangana region has dissipated the grandiose plans of the TRS of shaking up the Centre with its third phase of agitation for separate state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X