టిడిపి కరీంనగర్ రణభేరీ సమైక్యాంధ్రుల కుట్ర: కోదండరామ్

తెలుగుదేశం పార్టీ శానసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై జెఎసి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కుంటాల జలపాతంపై సీమాంధ్రుల జల విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ విడిగా డిమాండ్ చేశారు. కరీంనగర్లో బుధవారం తెలుగుదేశం తెలంగాణ ఫోరం తలపెట్టిన తెలంగాణ రణభేరీ బహిరంగ సభను అడ్డుకుంటామని ఒయు, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications