హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస నాటకాలు సాగవు, జెఎసి బయటకు రావాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాటకాలు ఇక సాగవని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను ఇన్నాళ్లు తెరాస మోసం చేస్తోందని, నాటకాలు ఆడుతోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ జెఎసి తెరాస చెప్పుచేతల్లోంచి బయటకు రావాలని ఆయన సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని కరీంనగర్ రణభేరీ ద్వారా నిరూపించామని ఆయన చెచెప్పారు. మనలో మనం కొట్టుకుంటే నవ్వుల పాలవుతామని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. కళాకారులు, మేధావులు, తెరాసకు దూరమైనవారు కలిసి ఒక వేదికగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు ద్రోహం చేసినవారికి కరీంనగర్ రణభేరీ కనువిప్పు కలిగించిందని ఆయన అన్నారు. తమ పార్టీ సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగం జనార్దన్ రెడ్డి చిల్లర పనులు మానుకోవాలని ఆయన సూచించారు. నాగం జనార్దన్ రెడ్డి ఎవరితో ఉన్నారో తమకు తెలుసునని, నాగం జనార్దన్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసునని ఆయన అన్నారు.

English summary
TDP Telangana forum convenor Errabelli Dayakar Rao said that TRS will not continue dramas on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X