వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనాన్ని శోభానాగిరెడ్డి ఆపలేరు: సి. రామచంద్రయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీలో తమ పార్టీ విలీనాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి ఆపలేరని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు. తమ ఆమోదం లేకుండా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విలీనం నిర్ణయం తీసుకున్నారని శోభా నాగిరెడ్డి చేసిన పిర్యాదుపై ఆయన ఆ విధంగా అన్నారు. గంటా శ్రీనివాస రావుతో కలిసి రామచంద్రయ్య విలీనానికి సంబంధించిన పత్రాలను శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.

శోభా నాగిరెడ్డి వ్యతిరేకిస్తే విలీనం ఆగిపోదని, 17 మంది విలీనానికి అనుకూలంగా అభిప్రాయం చెప్పారని ఆయన అన్నారు. విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తాము ఇసిని కోరినట్లు ఆయన తెలిపారు. త్వరలో ఇసి విలీనంపై ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. విలీన ప్రక్రియను పూర్తి చేసి కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చలు జరపడానికి సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు ఢిల్లీలో మకాం వేశారు.

English summary
Prajarajyam party leader C ramachandraiah said that Shobha Nagireddy can not stop merger of his party in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X