వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూపల్లి కృష్ణా రావు పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ ఎంపిల మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupalli Krishna Rao
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల శానసభా నియోజకవర్గంలో మంత్రి జూపల్లి పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు పలుకుతున్నారు. పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులను జూపల్లి కృష్ణా రావు సోమవారం అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ విందులో పార్లమెంటు సభ్యులు జి. వివేక్, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు విఠల్ హాజరయ్యారు. తన నియోజకవర్గం గద్వాలలో జూపల్లి కృష్ణా రావు పాదయాత్రను మరో మంత్రి డికె అరుణ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ అల్వాహార విందు జరిగింది.

డికె అరుణ వ్యతిరేకతతో జూపల్లి కృష్ణా రావు తన పాదయాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆయన తన పాదయాత్రను గద్వాలలో చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల మద్దతును ఆయన కూడగట్టుకుంటున్నారు. జూపల్లి కృష్ణా రావుకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమర్థిస్తున్నారు. కాంగ్రెసు విధానం మేరకే జూపల్లి కృష్ణా రావు పాదయాత్ర జరుగుతోందని మందా జగన్నాథం అన్నారు. జూపల్లి పాదయాత్ర కొనసాగింపునకు అవసరమైతే తాము డికె అరుణతో మాట్లాడుతామని ఆయన చెప్పారు.

English summary
Congress Telangana MPs are supporting minister Jupalli Krishna Rao's padayatra. They attended Jupalli Krishna Rao's breakfast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X