హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన లక్ష్మీపార్వతి, అమావాస్య చంద్రుడని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: తనను ఉదేశిస్తూ ఓ దుష్టశక్తి వల్లనే స్వర్గీయ ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేశానన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఎన్టీ రామరావు సతీమణి లక్ష్మీపార్వతి దుమ్మెత్తిపోశారు. తన చేతకాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు తనపై వ్యాఖ్యలు చేశారని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాశనమైపోయిందని ఆమె విమర్శించారు. చంద్రబాబునాయుడిని ఆమె అమావాస్య చంద్రుడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణిస్తున్నట్లుగా క్షీణిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి వల్లనే చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలిచారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారని ఆమె చెప్పారు. స్వర్గీయ ఎన్టీ రామారావు మృతికి చంద్రబాబే కారణమని ఆమె అన్నారు. చంద్రబాబుపై నమ్మకం లేక పార్టీ ఖాళీ అవుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబు వెన్నుపోటు వల్లనే ఎన్టీ రామరావు మనస్తాపానికి గురై మరణించారని ఆమె అన్నారు.

English summary
NTR TDP president and NT Rama rao's wife Laxmi Parvathi lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X