వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌దేవ్ బాబాకు రెడ్ కార్పెట్: స్వాగతం పలికిన కేంద్రమంత్రులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, నల్లడబ్బుపై జూన్ 4వ తేది నుండి నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించిన ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా హెచ్చరికలకు కేంద్ర ప్రభుత్వంలో వణుకు వచ్చింది. రామ్‌దేవ్ బాబాచే దీక్షను విరమింప చేయడానికి కేంద్రం తీవ్రంగా పాట్లు పడుతోంది. బుధవారం న్యూఢిల్లీ వెళ్లిన బాబాకు కేంద్రం ఎర్ర తివాచీ పరిచింది. బాబా విమానాశ్రయంలో దిగుతున్నాడని తెలిసిన వెంటనే కేంద్రం ఆయనకు స్వాగతం పలకడానికి ఏకంగా కేంద్ర మంత్రులను పంపించింది. కేంద్రమంత్రి కపిల్ సిబాల్, బన్సల్, సుబోద్‌లు న్యూఢిల్లీ విమానాశ్రయంలో బాబాకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు దీక్షను విరమించుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాబా దానికి తిరస్కరించారని సమాచారం. దీక్ష తదితర విషయాలపై చర్చించేందుకు రామ్‌దేవ్ ప్రణబ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం మీ డిమాండ్లను పరిష్కరించే మార్గంలోనే యోచిస్తుందని ప్రణబ్ చెప్పి దీక్షను విరమింప జేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సైతం బాబాకు దీక్ష విరమించాలని లేఖ రాశారు. కాగా పిఎంవో బాబాతో చర్చలకు దూరంగా ఉంది. ఇప్పటికే అన్నాహజారే దీక్షతో కంపించిన కేంద్రం రామ్‌దేవ్ బాబా దీక్ష చేస్తే తమ పరువు మరింత పోతుందనే బాబాకు రెడ్ కార్పెట్ పరిచి దీక్ష విరమింప జేసే ప్రయత్నాలు చేస్తోంది.

English summary
Central government welcomed Yoga Guru Baba Ramdev as red carpet. Centre is trying to cancel his Sathyagraha on corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X