వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ కోర్టుకు హాజరు కాని అనుష్క: భూవివాదం కేసు 30కి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anushka
విశాఖపట్నం: తప్పుడు పత్రాలతో భూమిని కొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటి అనుష్క గురువారం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ కేసును ఈ నెల 30వ తేదికి వాయిదా వేసింది. నాలుగేళ్ల క్రితం రవితేజ, అనుష్క కథానాయకుడు, కథానాయికగా నటించిన విక్రమార్కుడు చిత్రం సమయంలో అనుష్క, దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి విశాఖపట్నంలో భూమిని కొన్నారు. అయితే ఆ భూమిని వారు తప్పుడు పత్రాలు చూపించి కొన్నారని నారాయణ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు.

దీంతో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికీ పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సిందిగా అనుష్కకు కోర్టు సూచించింది. గతంలో ఓసారి తన లాయరును పంపించి కోర్టుకు హాజరు కాలేనని స్టే తెచ్చుకుంది. అయితే చివరిసారి కోర్టు జూన్ 2న హాజరు కావాలని ఆదేశించింది. అయితే అనుష్క ఈసారి కూడా హాజరు కాలేదు.

English summary
Heroine Anushka absented today to bhimili court for land grabbing issue at Vishakapatnam. Court adjorned this case to june 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X