వైయస్ జగన్‌కు విరుగుడుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి విశ్వాస తీర్మానం

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాటలకు బ్రేక్ వేసే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి జూపల్లి కృష్ణా రావు చేసిన రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన మనోగతాన్ని ఆయన బయటపెట్టినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చంద్రబాబు, ప్రతిపాదిస్తే పడగొడతామని వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అంటున్నారని, దీనికి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను శానససభలో విశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఆ సవాళ్లను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి అన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 4,6 తేదీల్లో శాసనసభ, మండలి ఉభయ సభలను సమావేశ పరచే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎదురు తిరిగే తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై వేటు వేస్తే సరిపోతుందని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయాలని, శాసనసమండలి చైర్మన్ ఎంపికను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ప్రభుత్వం బలపరీక్షకు దిగితే మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి వీలు కాదని, అదే సమయంలో ప్రభుత్వానికి బలం లేదనే ప్రతిపక్షాల నోళ్లు మూత పడతాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం బలపరీక్షకు దిగితే వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వానికి మెజారిటీ లేదనే విమర్సలకు తాళం వేయడానికి వీలవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బలపరీక్షకు సిద్ధపడి నెగ్గడం ద్వారా పాలన గాడిలో పడుతుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+