కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నేత ఉమాకాంత్ రెడ్డి హత్య: ప్రతీకార హత్యగా అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో చెర్లోపల్లి సత్రం వద్ద వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఓ వ్యక్తిని ఆదివారం ఫ్యాక్షన్ పగ బలి తీసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పెండ్లిమర్రి మండలానికి చెందిన ఉమాకాంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం సమయంలో పెండ్లిమర్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి హాజరు వేయించుకొని సుమోలో తిరిగి వస్తుండగా చర్లోపల్లి సత్రం దగ్గర ప్రత్యర్థులు లారీతో ఢీకొట్టి బాంబులతో దాడి చేసి వేట కొడవళ్లతో నరికి చంపి వేశారు. ఈ దాడిలో మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

కాగా ఐదు నెలల క్రితం ఉమాకాంత్ రెడ్డి తన ప్రత్యర్థి, గ్రామ సర్పంచ్ అయిన సుబ్బిరెడ్డిని హత్య చేసినందుకు ప్రతీకారంగానే సుబ్బిరెడ్డి వర్గం ఉమాకాంత్ రెడ్డిని హత్య చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బిరెడ్డిని ఉమాకాంత్ రెడ్డి ఐదు నెలల క్రితం యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద హత్య చేసిన కేసులో ప్రధాన నిందుతుడు. కాగా గ్రామంలో ఆధిపత్యం కోసమే ఈ హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

English summary
YS Jagan party leader Umakanth Reddy was killed in Kadapa today. He was main accused in murder case which is accured before five months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X