మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్న అపోలో ఆస్పత్రులు

అయితే దీనికి సంబంధించిన పెట్టుబడుల వివరాలు వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. మెడికల్ కాలేజీల కోసం నిధుల సేకరించేందుకు కంపెనీ క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సేకరించనున్నట్లు తెలుస్తుంది. మలేషియాకు చెందిన ఖజానా సావరిన్ ఫండ్ అపోలో ఆస్పత్రుల్లో భాగస్వామిగా చేరుతుందా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. అపోలో ఆస్పత్రులు తమ హెల్త్కేర్ ఎడ్యూకేషన్కు ఖాజానాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అపోలో ఆప్పత్రులు ఖజానాకు 12 శాతం వాటా ఉంది. చెనై్న ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న అపోలో ఆస్పత్రుల చైన్ ప్రస్తుతం 11 నర్సింగ్, ఆస్పత్రుల మేనేజ్మెంట్ కాలేజీలను నిర్వహిస్తోంది. 1,200 ఫార్మసీలు, 8,500 పడకలు గల 54 ఆస్పత్రులు నిర్వహిస్తోంది. తమ సంస్థ సుమారు 5,000 మందికి ప్రతి సంవత్సరం పారా మెడికల్ శిక్షణ ఇస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా 100 డయాగ్నోస్టిక్ సెంటర్లను నిర్వహిస్తోందని ఆమె అన్నారు.