సిఎంకు తెలంగాణ సెగ, మీడియాకు కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్

Kiran Kumar Reddy
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రైతు సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంగళవారం తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణవాదులు తెలంగాణ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. అలాగే, గ్రామసేవకులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. దాదాపు 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. తెలంగాణవాదులు ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల తీరుకు ముఖ్యమంత్రి తీవ్ర అసహనం ప్రదర్శించారు. రైతు సదస్సులో తెలంగాణ నినాదాలు శోచనీయమని ఆయన అన్నారు.

తన అసహనాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాపై ప్రదర్శించారు. మీడియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా రాంగ్ టూర్‌లో వెళ్తోందని ఆయన విమర్శించారు. ఒక పత్రిక, ఒక చానెల్ వార్తలను ఎవరూ నమ్మడం లేదని, రెండు మూడు పత్రికలు చదవి, చానెళ్లు చూసి ఆ వార్తలు నిజమా, కాదా అని తేల్చుకుంటారని ఆయన అన్నారు. మీడియా తన బాధ్యతను విస్మరించిందని ఆయన విమర్శించారు. మీడియాను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలని, కానీ 80 శాతం మంచిని పట్టించుకోకుండా 20 శాతం తప్పులనే మీడియా ఎత్తి చూపుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై పని కట్టుకుని విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+