వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుకు కొత్త తలనొప్పి, పిఎసి చైర్మన్ పదవిపై ఎర్రబెల్లి హెచ్చరిక
వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ రెడ్డికి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వరంగల్ జిల్లాకే చెందినవారు. దీంతో జిల్లాలో రేవూరి ప్రకాశ రెడ్డి ప్రాబల్యం పెరగకుండు అడ్డుపడుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర రెడ్డి ఈ పదవి కోసం పెద్గగా ప్రయత్నాలు చేయడం లేదు. అయితే, నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అసంతృప్తిని పోగొట్టడానికి రావుల చంద్రశేఖర రెడ్డికి ఆ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి, రంగా రెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డికి ఇవ్వాలని భావించారు. అయితే, ఆయన నాగం జనార్దన్ రెడ్డి వెంట వెళ్లడంతో ఆ పదవి దూరమైంది.
Comments
chandrababu naidu telugudesam errabelli dayakar rao చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎర్రబెల్లి దయాకర రావు
English summary
It is learnt that TDP president N Chandrababu Naidu is facing problem on PAC chairman post, as MLAs are in row.
Story first published: Sunday, June 12, 2011, 12:49 [IST]