కెసిఆర్ దుకాణం మూసుకోవాల్సిందే, జైపాల్ రెడ్డిది రోజుకో మాట: విహెచ్

తెలంగాణపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రోజుకో మాట్లాడడం సరి కాదని, దాన్ని ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తన వల్లనే వచ్చిందన్న జైపాల్ రెడ్డి ఇప్పుడు తన ప్రమేయం లేదనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి బయటకు వస్తే తెలంగాణ అమరవీరుల దీవెనలుంటాయని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ అధ్యాయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. మీడియాను, రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని అణచేయవచ్చునని శ్రీకృష్ణ కమిటీ చెప్పడంపై ఆయన మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని బయటపెట్టాలని తాము ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications