చిరంజీవి పార్టీ కథ ముగిసింది, విలీనానికి ఇసి గ్రీన్ సిగ్నల్
కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి ఇసికి సమర్పించిన పత్రంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతకం లేకపోవడంతో తొలుత ఆటంకం ఏర్పడింది. విలీనం పత్రంపై కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి సంతకం చేశారు. అయితే, ఆ పత్రంపై రెండు పార్టీల అధ్యక్షుల సంతకాలు ఉండాలని ఇసి తెలిపింది. దీంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సంతకంతో మరో పత్రాన్ని ఇసికి సమర్పించారు. దీంతో విలీనానికి ఆటంకాలు తొలగిపోయాయి.
కాగా, విలీనాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. రాజమండ్రిలో గానీ విజయవాడలో గానీ ఈ విలీన సభ జరగాలని, దానికి సోనియా గాంధీ గానీ రాహుల్ గాంధీ గానీ రావాలని ఆయన అంటున్నారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం ఆలోచన మరో విధంగా ఉంది. ఢిల్లీలోని ఎఐసిసి కేంద్ర కార్యాలయంలో చిరంజీవికి కాంగ్రెసు కండువా కప్పి విలీనం విషయాన్ని ప్రకటిస్తామని అంటోంది.