రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోదావరిలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు: నాలుగింటిలో మహిళది ఒకటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో నాలుగు మృతదేహాలు కొట్టుకు వచ్చిన సంఘటన సోమవారం స్థానికంగా సంచలనం రేపింది. జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతంలోని పివిఎన్ఆర్ పార్కు సమీపంలోని గోదావరి జాలాల్లో సోమవారం నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అందులో మూడు పురుషులవి కాగా, ఒకటి మహిళది. అయితే ఈ మృతదేహాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నాలుగు మృతదేహాలు మూడు రోజుల క్రితమే అక్కడికి కొట్టుకు వచ్చినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా ఆ మృతదేహాలు ఎవరివో, ఎక్కడి నుండి వచ్చావో అనే విషయంపై తెలియరాలేదు. వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా బలవంతంగా నదిలో తోసి వేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి దర్యాఫ్తు జరిపిన అనంతరం వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

English summary
Four dead bodies found at PVNR park in Godavari today. One is woman and three is men body in that. They found in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X