అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు తెరుస్తున్న యజుర్వేద మందిరం: భేటీలో ట్రస్టు నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: గత కొంతకాలంగా యజుర్వేద మందిరం తెరిచే విషయంపై కొనసాగుతున్న ఆసక్తికి ఎట్టకేలకు తెరపడింది. యజుర్వేద మందిరాన్ని గురువారం తెరవడానికి ట్రస్టు సభ్యులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం ట్రస్టు సభ్యులు పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు యజుర్వేద మందిరం తెరిచే విషయంపై, సత్యసాయి బాబా మహా సమాధి నిర్మాణంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌కు కీలక పదవి అప్పగించే విషయంపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

కాగా యజుర్వేద మందిరం తెరిచే విషయంపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సత్యసాయి ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు అన్ని యజుర్వేద మందిరంలో ఉన్నట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు ఆస్తులు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఉండవచ్చని పలువురి అంచనా. కాగా యజుర్వేద మందిరం తెరిచే విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని, అది వారి ప్రయివేటు వ్యవహారం అని కలెక్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

English summary
Sathya Sai Trust committee take decision on Yajurveda Mandiram opening in today's meeting. It will be opened on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X