మంత్రుల రాజీనామాలు కోరనున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి?

ఇటీవల చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్ రావు మంత్రివర్గంలో కొందరు అవినీతిపరులు ఉన్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంత్రులంతా సిఎంకు రాజీనామాలు సమర్పించాలని లేదా సిఎం మంత్రుల రాజీనామా కోరి అవినీతి మంత్రులపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెసులో పిఆర్పీ విలీనం అయింది. అంతేకాదు త్వరలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుందనే వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో మంత్రుల రాజీనామా కోరే అవకాశం ఉందనే ఊహాగానాలకు తెరలేచింది. కాగా తెలంగాణ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని పలువురు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications