వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన జైపాల్ రెడ్డి, తెలంగాణ బ్యాడ్జీతో తెలంగాణ నినాదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి దిగి వచ్చారు. ఆయన తెలంగాణ బ్యాడ్జీ ధరించారు. అంతేకాకుండా జై తెలంగాణ నినాదాలు చేశారు. తాను జాతీయవాదినని, ప్రాంతీయవాదని కాదని జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది. జైపాల్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగా జమకట్టి విమర్శలు చేశారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కానని చెప్పుకోవడానికి జైపాల్ రెడ్డి అందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఇచ్చిన విందులో జైపాల్ రెడ్డి తెలంగాణ నినాదాలు చేశారు.

విందుకు వచ్చిన జైపాల్ రెడ్డి జై తెలంగాణ బ్యాడ్జీ ధరించారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కోరడంతో ఆయన తెలంగాణ నినాదాలు కూడా చేశారు. తాను తెలంగాణకు మద్దతిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి చెప్పాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డిని కోరారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీని, చిదంబరాన్ని తదితరులను కలవడానికి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు బుధవారం ఢిల్లీ వచ్చారు. వారంతా హనుమంతరావు ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ విందుకు జైపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.

English summary
Union Minister S Jaipal Reddy made Jai Telangana slogans at MP V Hanumanth Rao's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X