జగన్ వైపు వెళ్తున్నవారి వివరాలు ఇవ్వండి: మంత్రులకు సిఎం సూచన

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో గానీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో గానీ తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశానికి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. అధికారులు మంత్రుల మాట వినిడం లేదని మంత్రి దానం నాగేందర్ ఫిర్యాదు చేశారు. అందుకే ఐఎఎస్ అధికారులను బదిలీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో సహకార ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయాన్ని హైకోర్టు తీర్పు వెలువడే దాకా వాయిదా వేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామనే నిర్ణయానికి వచ్చింది. బిసి రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications