న్యూఢిల్లీలో తెలంగాణ ప్రకంపనలు: ప్రధాని నివాసంలో కోర్ కమిటీ చర్చ

టి-కాంగ్రెసు కూడా ఈ భేటీ కేంద్ర మంత్రులతో తమ భేటీకి కొనసాగింపే అని చెబుతున్నారు. మా మనోభావాలు ప్రధాని, ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీకి చెబుతామని కేంద్రమంత్రులు తమకు హామీ ఇచ్చారని ఈ కోర్ కమిటీ సమావేశంలో వారు తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను సోనియాకు వెల్లడించనున్నారని అభిప్రాయపడ్డారు. ఆల్ పార్టీ మీటింగ్ పై కూడా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందే తెలంగాణపై కాంగ్రెసు అభిప్రాయం వ్యక్తంపర్చాల్సిన ఆవశ్యకతను కూడా వారు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కోర్ కమిటీ సమావేశంలో లోక్ పాల్ బిల్లు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ వ్యవహారం, అన్నాహజారే వ్యవహారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు అంశాలపైనే కోర్ కమిటీ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications