పుట్టపర్తి సత్య సాయి డబ్బు తరలింపులో కీలక వ్యక్తి పాత్ర

Sathya Sai Baba
అనంతపురం: పుట్టపర్తిలోని సత్య సాయిబాబా మందిరం ప్రశాంతి నిలయం నుంచి డబ్బు తరలించడంలో ఓ కీలక వ్యక్తి పాత్ర ఉందని అనంతపురం జిల్లా పెనుకొండ డిఎస్పీ కోలారు కృష్ణ చెప్పారు. అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద శనివారం పట్టుబడిన డబ్బు సత్యసాయి ట్రస్టుదే అనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు చెప్పినట్లు ఎవరూ డబ్బు కోసం తమ వద్దకు రాలేదని వెల్లడించారు. పట్టుబడిన సొమ్మంతా 12 మంది సత్యసాయి భక్తులకు సంబంధించిన మొత్తమని, ఆధారాలతో వారు పోలీసులకు వివరిస్తారంటూ ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌ ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు.

కాగా, డబ్బు తరలిస్తూ పట్టుబడిన డ్రైవర్ హరీష్ నందాను ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతన్ని పోలీసులు సోమవారం కోర్టు ముందు హాజరు పరిచారు. నందా సత్య సాయి ట్రస్టు డ్రైవరేనని తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. 35 లక్షల రూపాయలను తరలిస్తూ నందా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+