జయశంకర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన తెరాస అధినేత కెసిఆర్

K Chandrasekhar Rao
వరంగల్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ భౌతిక కాయాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కంటతడి పెట్టారు. జయశంకర్ మృతి వార్త విన్న వెంటనే ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే హైదరాబాదు నుంచి బయలుదేరి హన్మకొండకు చేరుకున్నారు. ఉద్యమ ప్రారంభం నుంచి తన వెన్నంటి ఉండి ధైర్యం నూరిపోశారని ఆయన అన్నారు. జయశంకర్ మృతికి తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే జయశంకర్‌కు అర్పించే నివాళి అని ఆయన అన్నారు.

జయశంకర్ భౌతిక కాయం వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఏడ్చేశారు. జయశంకర్ మృతికి మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. జయశంకర్ మృతికి కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, స్వామి అగ్నివేశ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సంతాపం ప్రకటించారు. జయశంకర్‌ను కడసారి చూసేందుకు హన్మకొండకు పెద్ద యెత్తున తెలంగాణ నాయకులు, ప్రజలు చేరుకుంటున్నారు.

అభ్యుదయ భావాలు కలిగిన జయశంకర్ మృతి బాధాకరమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సిద్ధాంతాల కోసం జయశంకర్ జీవితాంతం పోరాడారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించడమే కాకుండా ఓ పార్టీకి పుట్టుకకు కారణమయ్యారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+