హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వర్సెస్ ఎంపీ: దూషించుకున్న శంకర రావు, సర్వే సత్యనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: ప్రోటోకాల్ విషయంలో రాష్ట్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చేనేత, జౌళీ శాఖ మాత్యులు శంకర్ రావు, పార్లమెంటు సభ్యులు సర్వే సత్యనారాయణ మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని బొల్లారం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి తనను పిలవనందుకు ఎంపీ సర్వే సత్యనారాయణ అధికారులను నిలదీశారు. అధికారులను ఎంపీ నిలదీయడంతో మంత్రి శంకర్ రావు మాత్రం అధికారులకు వత్తాసు పలికారు.

దీంతో సర్వే, శంకర్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువురు వాదులాడుకున్నారు. ఇరువరు పరస్పరం దూషించుకున్నారు. మంత్రి, ఎంపీ వర్గాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు కలుగజేసుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. కాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు అదీ ఒక పార్టీకి చెందినవారు బహిరంగంగానే దూషించుకోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
War of words take place between minister Shankar Rao and MP Sarve Satyanarayana today at Bollaram government school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X