హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలోని ఆరాంఘర్‌లో ఓ పద్నాలుగేళ్ల బాలిక దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. మెట్రో ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే దుండగులు బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో హత్యే అని పోలీసులు భావిస్తున్నారు.

బాలిక ఒంటిపై కాలిన గాయాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకు వచ్చి పడేసే ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే సదరు బాలిస ఇళ్లలో పని చేసే అమ్మాయి అని భావిస్తున్నప్పటికీ బాలిక వివరాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Police found Fourteen years girl dead body at Aranghar near Rajendra Nagar. Police suspecting that it was murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X