ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదు: చంద్రబాబు
మద్యం ధరలను, పెట్రోలు, డీజీల్ ఇతర నిత్యావసర ధరలను పెంచి పేదల సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెసు నేతలు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెసు హయాంలో అన్ని వర్గాలకు సక్రమంగా ఆదాయం పంపిణీ కావడం లేదన్నారు. వ్యవసాయం
రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలను ప్రజలు నమ్మ వద్దని చంద్రబాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో వెళ్లాయి అన్నారు. అనంతరం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పాఠశాల భవనం ప్రారంభించారు. కాగా అంతకుముందు చంద్రబాబు ఎడ్లబండికి సిలిండర్ కట్టి వినూత్న నిరసన తెలిపారు.