శ్రీ సత్య సాయి ట్రస్టు సభ్యులను వెనకేసుకొచ్చిన మంత్రి గీతారెడ్డి

తాను అప్పుడూ ఇప్పుడూ ట్రస్టుకు దూరమేనని ఆమె చెప్పారు. ట్రస్టు సభ్యుల తీరుపై తాను స్పందించబోనని ఆమె అన్నారు. తాను సత్య సాయి బాబా భక్తురాలినేనని ఆమె చెప్పుకున్నారు. సత్య సాయి బాబా భక్తురాలిగా తాను పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. సత్య సాయి బాబా ప్రజల కోసం ఎంతో చేశారని, మంచినీటి సౌకర్యం కల్పించారని, ఉచిత వైద్యం అందించారని ఆమె చెప్పారు. ట్రస్టు సేవా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా మీడియా కూడా నియంత్రణ పాటించాలని ఆమె సూచించారు.
సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాలపై ముఖ్యమంత్రి కమిటీ వేసినప్పుడు కూడా తాను హైదరాబాదులో లేనని, తాను విదేశాల్లో ఉన్నానని ఆమె చెప్పారు. ఇంతకు ముందు సత్య సాయి బాబాను ఆస్పత్రిలో చేరిన వెంటనే పుట్టపర్తి చేరుకున్న ఆమె అక్కడే కొద్ది రోజులు మకాం కూడా వేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications