వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొన్నాల సమక్షంలో జెడ్పీ రసాభాస: టిఆర్ఎస్ సభ్యుల ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల ఆత్మహత్యాయత్నం, కాంగ్రెసు, టిఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తం, దీంతో సభ రసాభాసగా - ఇది సోమవారం వరంగల్ జిల్లా పరిషత్ సమావేశం సాగిన తీరు. వరంగల్‌లో జరిగిన జిల్లా పరిషత్ సమావేశాలలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం తెలంగాణ ఉద్యమ సారథి ఆచార్య జయశంకర్‌కు జెడ్పీ సమావేశం నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర బలగాలను వెనక్కి పంపించే విషయంలో టిఆర్ఎస్, కాంగ్రెసు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలోని కేంద్ర బలగాలను పంపించేందుకు అధికార కాంగ్రెసు ప్రభుత్వం పూనుకోవాలని టిఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.

కేంద్ర బలగాల విషయంపై టిఆర్ఎస్ సభ్యుడు ఒకరు మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ అయింది. దీంతో కాంగ్రెసు, టిఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ సభ్యులు సమావేశ మందిరంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఓ దశలో టిఆర్ఎస్ సభ్యులు అక్కడే ఉన్న వైర్లతో అత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. సభ రసాభాసగా మారడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు. కొద్ది సేపటికి సభ తిరిగి ప్రారంభమైంది.

English summary
TRS ZP members trying to suicide in ZP meeting today in Warangal. They demanded sent back central police force from Telangana in meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X