వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పివి ఫొటో లేకపోవడంతో ఇబ్బంది పడిన మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

PV Narasimha Rao
వరంగల్: ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ప్రధాని పివి నరసింహా రావు ఫొటో లేకపోవడంతో 91వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఇబ్బంది పడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరా రెడ్డి మంగళవారం పివి నరసింహారావుకు నివాళులు అర్పించాలని అనుకున్నారు. అయితే, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పివి ఫొటో లేదు. దాంతో ఆయన పొటో సంపాదించడానికి అధికారులు పరుగులు పెట్టి సంపాదించారు. దాంతో మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు.

కౌలు రైతుల విధానాన్ని జిల్లా యంత్రాంగంతో సమీక్షించడానికి మంత్రి రఘువీరా రెడ్డి వచ్చారు. అప్పుడు రఘువీరా రెడ్డి పివి నరసింహారావుకు నివాళులు అర్పించాలనే విషయం గుర్తుకు వచ్చింది. తీరా చూస్తే, ఫొటో లేదు. దాంతో అధికారులు సమాచార శాఖ కార్యాలయానికి పరుగెత్తారు. అక్కడ కూడా పివి ఫొటో లేదు. దాంతో పివి కుటుంబ సభ్యుల నుంచి ఆ ఫొటో సంపాదించారు. ప్రభుత్వ తీరు పట్ల పివి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

English summary
The non-availability of former Prime Minister late P V Narasimha Rao's photo in the government offices on his 91st birth anniversary here came as a major embarrassment to the district administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X