వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఏదో ఒకటి తేల్చండి: సోనియాతో సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో త్వరగా ఏదో ఒకటి తేల్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లుగా తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి గురువారం ఉదయం సోనియాతో భేటీ అయ్యారు. ఆయన తెలంగాణ సమస్యను తేల్చాలని చెప్పడంతో పాటు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న శాసనసభ్యులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సమస్య చాలా క్లిష్టంగా మారిందని సిఎం సోనియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

కాగా తెలంగాణపై కేంద్రం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లుగా రెండేళ్ల పాటు తెలంగాణకు ప్రత్యేక సహాయం ప్రకటించి అప్పటికీ ప్రత్యేక రాష్ట్రం వాదన వినిపిస్తే ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికలలోనే రాష్ట్రంపై ఓ నిర్ణయం తీసుకొనున్నట్లుగా తెలుస్తోంది. కాగా సిఎం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎకె ఆంటోనీతో గురువారం భేటీ కానున్న సిఎం టి-కాంగ్రెసు గడువుల హెచ్చరికలు, జగన్ వర్గం నేతలపై మాట్లాడనున్నారని తెలుస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy urged AICC president Sonia Gandhi to clear Telangana issue soon. CM may met Rahul Gandhi also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X