తెలంగాణ వచ్చేవరకు పోటీ చేయవద్దు: మోత్కుపల్లి

మళ్లీ ఎన్నికలంటూ జరిగితే అది తెలంగాణ రాష్ట్రంలోనే జరగాలని నర్సింహులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా దీనికి కట్టుబడి ఉండాలన్నారు. ఈ నెల నాలుగున రాజీనామాలకు సిద్ధమవుతున్న నేతలంతా దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోమని అమరవీరులస్థూపం వద్ద ప్రమాణం చేయాలన్నారు. ఈ నెల నాలుగున ముందుగా ప్రమాణం చేసి ఆ తర్వాతే స్పీకర్కు రాజీనామాలు సమర్పించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications