వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలపై అధిష్టానం సీరియస్, బుజ్జగింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా అస్త్రాలు సంధించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధుల అంశాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకొని వారిని బుజ్జగించే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. టి-కాంగ్రెసు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం మీద పడుతుందన్న ఉద్దేశ్యంతో అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంది. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులను రంగంలోకి దింపినప్పటికీ టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గలేదు.

సోమవారం టి-కాంగ్రెసు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆదివారం సైతం అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉధయం పిసిసి చీఫ్ బొత్సతో భేటీ అయ్యారు. వారితో బొత్స టి-కాంగ్రెసు రాజీనామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం బుజ్జగింపులను టి-కాంగ్రెసు బేఖాతరు చేస్తోంది. తాము బుజ్జగింపులకు లొంగేది లేదని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాకే తాము వెనక్కి తగ్గుతామని కెకె ఆ తర్వాత చెప్పారు.

English summary
Congress high command is trying to cool telangana congress leaders. PCC chief Botsa met t-ministers and he may met with other leaders today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X