Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామాలపై అధిష్టానం సీరియస్, బుజ్జగింపులు

Sonia Gandhi
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా అస్త్రాలు సంధించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధుల అంశాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకొని వారిని బుజ్జగించే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. టి-కాంగ్రెసు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం మీద పడుతుందన్న ఉద్దేశ్యంతో అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంది. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులను రంగంలోకి దింపినప్పటికీ టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గలేదు.

సోమవారం టి-కాంగ్రెసు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆదివారం సైతం అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉధయం పిసిసి చీఫ్ బొత్సతో భేటీ అయ్యారు. వారితో బొత్స టి-కాంగ్రెసు రాజీనామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం బుజ్జగింపులను టి-కాంగ్రెసు బేఖాతరు చేస్తోంది. తాము బుజ్జగింపులకు లొంగేది లేదని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాకే తాము వెనక్కి తగ్గుతామని కెకె ఆ తర్వాత చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+