48 గంటల తెలంగాణ బంద్: జెఏసి పిలుపు

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 48 గంటల బందుకు తెలంగాణలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సుమారు 100 మంది రాజీనామా చేసినప్పటికీ చిదంబరం దానిని లైట్గా తీసుకొని తెలంగాణ ప్రజలకు బాధ కలిగించారని అన్నారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు నిరవధిక సమ్మెకు సన్నద్ధం అవుతున్నాయన్నారు. తెలంగాణ నేతల రాజీనామాలపై కేంద్రం స్పందించక పోవడం బాధాకరం అన్నారు. సింగరేణి కార్మికులు కూడా బందుకు సహకరించాలని కోరారు.
కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్తో పాటు కెసిఆర్ కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications