వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నేతలను చర్చలకు ఆహ్వానించిన ఆజాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ‌: తెలంగాణకు చెందిన మంత్రులను కొంత మందిని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చర్చలకు ఆహ్వానించారు. రాజీనామాలు చేయకుండా చర్చలకు రావడానికి కాంగ్రెసు తెలంగాణ నేతలు నిరాకరించారు. తెలంగాణకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత మంత్రి కె. జనా రెడ్డి నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం చర్చలకు ఢిల్లీకి రానున్నట్లు తెలుస్తోంది. జానారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరే అవకాశాలున్నాయి.

కాగా, తెలంగాణ అంశం జఠిలమైందని, దీనిపై అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పటికే కొందరిని తాము ఢిల్లీకి అహ్వానించామని, వారితో చర్చలు జరుపుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఎనమండుగురు స్పీకర్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. వారు సమయానికి రాకపోవడంతో కార్యాలయం నుంచి స్పీకర్ మీరా కుమార్ వెళ్లిపోయారు. వారు సమయానికి రాలేదని మీరా కుమార్ చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi azad invited party Telangana leaders for talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X