జగన్‌ను ఢీకొట్టేందుకు వైయస్ మిత్రుడు కెవిపి రెడీ

KVP Ramachandar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునేందుకే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. శుక్రవారం వైయస్సార్ జయంతి సందర్భంగా ఆయన వివిధ టీవీ చానెళ్లతో మాట్లాడారు. ఈ మాటల్లో ఆయన పరోక్షంగా ఆ విషయాన్ని వెల్లడించారు. తన ప్రియమిత్రుడి గురించి మాట్లాడే మిషతో ఆయన తాను కాంగ్రెసులోనే ఉంటానని, వైయస్ జగన్‌ను ఎదుర్కుంటానని చెప్పకనే చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయడం వైయస్సార్ ఆశయమని, అందుకు తాను కృషి చేస్తానని, కాంగ్రెసు కార్యకర్తలంతా అందుకు పని చేయాలని ఆయన అన్నారు.

వైద్య కళాశాలలో తాము ఒకే గదిలో ఉండేవాళ్లమని, అప్పుడే తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలని అనుకునేవాళ్లమని ఆయన అన్నారు. ప్రతి విషయంపై వైయస్సార్ తనతో చర్చించేవారని, కొన్ని విషయాల్లో తాను విభేదించేవాడినని ఆయన చెప్పారు. వైయస్ మరణంతో తన జీవితంలో శూన్యం ఏర్పడిందని, ఆ లోటు తీరేది కాదని ఆయన అన్నారు. వైయస్సార్ జీవించి ఉంటే సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు ఉండేవి కావని ఆయన అన్నారు. పాదయాత్ర తర్వాత వైయస్సార్ వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

వైయస్సార్ జయంతి రోజు శుక్రవారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ జరగబోతుండగా వివిధ తెలుగు టీవీ చానెళ్ల ప్రతినిధులతో కెవిపి రామచందర్ రావు మాట్లాడడం ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు అన్ని ప్రధాన టీవీ చానెళ్లు ఆయనతో మాట్లాడాయి. వైయస్సార్‌తో తన అనుబంధాన్ని ఆయన నెమరేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+