చిరంజీవిపై ఆరోణలు: కోర్టుకు సినీ హీరో రాజశేఖర్
బ్లడ్బ్యాంక్ స్థాపించి సేవ చేస్తున్న చిరంజీవిపై తరచూ రాజశేఖర్, జీవిత దంపతులు అర్ధంలేని ఆరోపణలు చేయడం తగదని ఆ పార్టీ నాయకులు హితవుపలికారు. శుక్రవారం మియాపూర్లో ఆ పార్టీ గ్రేటర్ కార్యదర్శి తూము మనోజ్కుమార్, శేరిలింగంపల్లి పార్టీ కన్వీనర్ సమ్మెట ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేవలం ఉనికి నిలబెట్టుకోవడానికి అసత్యపు ఆరోపణలు చేయడం ఈ దంపతులకు అలవాటైందని అన్నారు. పునరావృతం అయితే పార్టీ కార్యకర్తలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో కె.సుధాకర్, కె.ఎల్.ఎన్.స్వామి, షైజ తదితరులు పాల్గొన్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై రాజశేఖర్, జీవిత తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాల్సిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రజలకు సేవ చేయడం లేదని వారు ఆరోపించారు. జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. కమిటీ బ్లడ్ బ్యాంకుకు క్లీన్చిట్ ఇచ్చింది.