హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు గోనె ప్రకాష్ రావు ఝలక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నాయకుడు గొనె ప్రకాష్ రావు ఝలక్ ఇచ్చారు. కడప జిల్లాలోని పులివెందులలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టారు. పైగా, తెలంగాణకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకుంటేనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని చెప్పారు. అయితే, గోనె ప్రకాష్ రావుకు పార్టీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన స్థానమేదీ కల్పించలేదు.

ఒక రకంగా గోనె ప్రకాష్ రావును వైయస్ జగన్ విస్మరించారనే చెప్పవచ్చు. తొలి రోజుల్లో సాక్షి మీడియా గోనె ప్రకాష్ రావుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. కానీ క్రమంగా ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. దేని గురించైనా అనర్గళంగా, గొంతు చించుకుని మాట్లాడే అలవాటు గోనె ప్రకాష్ రావుకు ఉంది.

English summary
YSR Congress party leader Gone Prakash Rao from Telangana region stayed away from party plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X