అజర్కు మంత్రి పదవి, చిరుకు గుండు సున్నా?

ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మాజీ క్రికెటర్ మొహ్మద్ అజరుద్దీన్కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు మంత్రివర్గంలో కొత్తగా ప్రాతినిధ్యం కల్పించడానికి సోనియా గాంధీ సిద్ధంగా లేరు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందినవారిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవికి కూడా మొండిచేయే చూపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.
రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. సహాయ మంత్రులుగా ఉన్న పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రమోషన్ ఆశిస్తున్నారు. నిజానికి, కిశోర్ చంద్రదేవ్కు లోకసభ స్పీకర్ పదవి దక్కాల్సి ఉంది. కానీ, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సుముఖంగా లేకపోవడం ఆయనను పక్కన పెట్టారు. అప్పటి నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో కిశోర్ చంద్రదేవ్ ఉన్నారు. కానీ ఆయన ఆశలు ఈసారి కూడా వమ్ము అయ్యేట్లే ఉన్నాయి.












Click it and Unblock the Notifications