వైయస్ జగన్ పార్టీకి అంత సీన్ లేదు: ముఖ్యమంత్రి

తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, రాజీనామాల వ్యవహారం సర్దుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని మంత్రులను తానే కాకుండా పార్టీ అధిష్టనం కూడా అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. కొత్త ఆర్డినెన్స్ ద్వారా 26 లక్షల మంది సాగు రైతులకు లబ్ధి చేకూరనుందన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలో కోటి మంది రైతులకు రూ.44 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరలోనే కొనుగోలు చేస్తామన్నారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరలో జాతీయ హోదా వస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications