వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెకె, మందా ఇతర తెలంగాణ కాంగ్రెసు ఎంపిల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను పోలీసులు సోమవారం సాయంత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద అరెస్టు చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన వారిని పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అనుమతించలేదు. దాంతో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బయటివారు లోనికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పినా వారు వినలేదు. లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఐదుగురు పార్లమెంటు సభ్యులను, ఓ శాసనసభ్యుడిని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాదులోని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, మధు యాష్కీలను, శాసనసభ్యుడు రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తమను ప్రభుత్వం అణచివేస్తోందని, తమకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లి విద్యార్థులను పరామర్శించే హక్కు ఉందని పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. పోలీసుల తీరుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు సామూహిక నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. వారిని పరామర్శించేందుకు వారు ఉస్మానియాకు వెళ్లారు.

English summary
Congress Telangana MPs arrested near Osmania University in Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X