ముగిసిన 168 ఏళ్ల ప్రస్థానం 'న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్'

News of the World
లండన్‌: బ్రిటిష్‌ అగ్రశ్రేణి టాబ్లాయిడ్‌ పత్రిక 'న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' 168 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. పత్రిక చివరి ప్రత్యేక సంచికను ఆదివారం అభిమాన పాఠకులు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. చివరి సంచికపై 'థ్యాంక్యూ అండ్‌ గుడ్‌బై' అని పేర్కొన్నారు. 'మా పయనం ముగిసింది' అంటూ ఆఖరు సంపాదకీయంలో రాశారు. చివరి రోజు దాతృత్వ సంస్థల ప్రకటనలనే ముద్రించారు. ఈ చరిత్రాత్మక ఎడిషన్‌పై వచ్చే లాభాలను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పత్రిక పేర్కొంది.

మీడియా సామ్రాజ్యాధిపతి రూపర్ట్‌ ముర్డోక్‌ తనయుడు జేమ్స్‌ ముర్డోక్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, టాబ్లాయిడ్‌ను మూసివేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే దీని చరిత్ర ముగిసింది. 'న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' టాబ్లాయిడ్‌ సంచలన వార్తల కోసం లండన్‌ బాంబు దాడుల్లో మృతి చెందిన బాధితుల పిల్లలు, ఇరాక్‌, అఫ్గాన్‌లో మరణించిన సైనికుల కుటుంబ సభ్యుల ఫోన్లను హ్యాకింగ్‌ చేసిందనీ, కూపీల కోసం డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు, ఆ తర్వాత తలెత్తిన పరిణామాలు పత్రిక మూసేయడానికి దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+